కిలిమంజారో అధిరోహించిన 9ఏళ్ల ఆంధ్రా చిన్నారి

ABN , First Publish Date - 2021-03-02T21:46:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో రెండో పర్వతమైన మౌంట్ కిలిమంజారో ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే..

కిలిమంజారో అధిరోహించిన 9ఏళ్ల ఆంధ్రా చిన్నారి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాల్లో రెండో పర్వతమైన మౌంట్ కిలిమంజారో ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే ఈ పర్వాతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ రికార్డు సాధించిన రెండో పిన్నవయస్కురాలిగా నిలిచింది. అనంతరపురం జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే చిన్నారి ఈ ఘనత సాధించింది. 


మౌంట్ కిలిమంజారో పర్వతం టాంజేనియాలో ఉంది. ఇది ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం. అంతేకాకుండా ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన రెండో పర్వతం. ఎవరెస్ట్ తొలి స్థానంలో ఉంది. రిత్విక శ్రీ కిలిమంజారోను అధిరోహించినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆమె ఈ ఫీట్ సాధించేందుకు ఆయన ఎస్‌సీ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.2.98 లక్షలు విడుదల చేశారు. ఆమె కిలిమంజారో అధిరోహించిన విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ చంద్రుడు ‘ఇలానే స్ఫూర్తి నింపుతూ ఉండు’ అంటూ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-03-02T21:46:26+05:30 IST