ఒక్క రోజే 9,718 కేసులు
ABN , First Publish Date - 2020-03-30T09:41:48+05:30 IST
జనతా కర్ఫూ (ఆదివారం 22/03/2020) నుంచి ఏడవ రోజు లాక్డౌన్ (ఆదివారం 29/03/2020) దాకా గడచిన వారం రోజులలో నగర జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల కొరడా
ప్రభుత్వ సూచనలను పట్టించుకోని పౌరులు
ఇప్పటికీ అక్కడక్కడ రోడ్లపైకి జనం
లాక్డౌన్ కఠినతరం చేస్తున్న పోలీసులు
ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు
జనతా కర్ఫూ (ఆదివారం 22/03/2020) నుంచి ఏడవ రోజు లాక్డౌన్ (ఆదివారం 29/03/2020) దాకా గడచిన వారం రోజులలో నగర జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కొన్ని మినహాయింపులతో కూడిన లాక్డౌన్కు దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాలు అలవాటు పడ్డాయి. అయితే.. ఆదివారం కొన్ని మార్కెట్ల దగ్గర కనబడ్డ రద్దీ... ఇంకా సామాజికంగా మరిన్ని మార్పులు రావాల్సిన అవసరాన్ని సూచించింది.
లాక్డౌన్ మినహాయింపులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని భావించిన పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారు. ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తేనే కరోనాపై కదనంలో విజయం పొందగలమని సామాజిక శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అంతేకాక... పౌరుల అవసరాలకు తగ్గట్లు సరుకుల పంపిణీ జరిగితే.. దుకాణాలపైకి ఎగబడడం సహజంగానే తగ్గిపోతుందని కూడా సూచిస్తున్నారు. తొలి వారం నేర్పిన పాఠాలతో... నగరం లాక్డౌన్ ఎనిమిదో రోజులోకి అడుగుపెడుతోంది.
హైదరాబాద్ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) :
లాక్డౌన్ అమల్లో ఉన్నా... బయటకు వస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. నిబంధనలను పాటించని వాహనాలను కెమెరాల ద్వారా గుర్తించి ఆన్లైన్లో చలానాలు పంపిస్తున్నారు. ఏఎన్పీఆర్ కెమెరాల ఆధారంగా పరిమితికి మించి కూర్చొని, 3 కిలోమీటర్ల పరిధి దాటి తిరుగుతున్న, పదేపదే బయటకు వస్తున్న వాహనాలను ప్రత్యేక టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిపై చలానాలు పంపించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. అకారణంగా రోడ్డుపైకి వాహనంతో వచ్చినవారి వాహనాలపై కేసులు నమోదుచేసి సీజ్చేస్తున్నారు.
రోడ్లపై నమోదు చేసిన కేసులు
మార్చి 27 మార్చి 28 మార్చి 29
ద్విచక్రవాహనాలు 597 732 1508
ఆటోలు 71 41 72
కార్లు 48 53 126
భారీవాహనాలు 1
కెమెరాల ద్వారా నమోదైన కేసులు
మార్చి 27 మార్చి 28 మార్చి 29
ద్విచక్రవాహనాలు 9,742 9,648 7,814
ఆటోలు 58 27 55
కార్లు 455 395 122
భారీవాహనాలు 61 53 20