8న డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-07-06T03:22:51+05:30 IST
ప్రాథమిక పాఠశాలల ఉనికిని దెబ్బతీసేలా ఉన్న జీవో నెంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న నిర్వహిం
కందుకూరు, జూలై 5: ప్రాథమిక పాఠశాలల ఉనికిని దెబ్బతీసేలా ఉన్న జీవో నెంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న నిర్వహించనున్న డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. కందుకూరు ప్రాంత ఫ్యాప్టో సమావేశం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మంగళవారం వై. అశోక్ అధ్యక్షతన జరిగింది. ఇందులో వివిధ ఉపాధ్యాయసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8న ముట్టడి కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జీవో 117ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని నిలుపుదల చేయాలని, తెలుగు, ఆంగ్లమాథ్యమాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు వై. అశోక్బాబు, కె. మోహనరావు, ఏవీ రావు, జీ.సతీష్, బీ మాల్యాద్రి, ఎస్డీ మునీర్బాషా, టీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.