ప్రజావాణిలో 87 అర్జీలు
ABN , First Publish Date - 2022-05-24T05:41:16+05:30 IST
ప్రజావాణిలో 87 అర్జీలు
మేడ్చల్ అర్బన్, మే 23: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 87 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, అధికారులు పాల్గొన్నారు.