Lucknow: ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ప్రాణం తీసింది.. ఇరుగుపొరుగు వారు కాపాడేందుకు ప్రయత్నించినా..

ABN , First Publish Date - 2022-07-13T22:34:33+05:30 IST

ఆమె రిటైర్డ్ టీచర్.. వయసు 82 సంవత్సరాలు.. లక్నోలోని కైసర్‌బాగ్‌లో తన కొడుకుతో కలిసి నివసిస్తోంది..

Lucknow: ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ప్రాణం తీసింది.. ఇరుగుపొరుగు వారు కాపాడేందుకు ప్రయత్నించినా..

ఆమె రిటైర్డ్ టీచర్.. వయసు 82 సంవత్సరాలు.. లక్నోలోని కైసర్‌బాగ్‌లో తన కొడుకుతో కలిసి నివసిస్తోంది..  వారు చాలా రోజులుగా బ్రౌనీ అనే కుక్కను పెంచుకుంటున్నారు.. బుధవారం రాత్రి ఆమె కొడుకు ఊరు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది.. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో పెంపుడు కుక్క ఆమెపై దాడి చేసింది.. ఆమె కేకలు వేయడంతో సహాయం చేసేందుకు ఇరుగుపొరుగు వారు వచ్చారు.. లోపలి నుంచి తాళం వేసి ఉండటంతో ఎవరూ ఏం చేయలేకపోయారు.


ఇది కూడా చదవండి..

Shocking: సమాధి నుంచి వస్తున్న శబ్దాలు విని భయపడ్డ గ్రామస్తులు.. తవ్వి తీసి చూస్తే షాక్..


లక్నోలోని కైసర్‌బాగ్‌లో 82 ఏళ్ల సుశీల త్రిపాఠి అనే వృద్ధురాలు పెంపుడు కుక్క దాడిలో బుధవారం ఉదయం తీవ్ర గాయాల పాలైంది. లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో ఇరుగు పొరుగు వారు లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత ఆమె కొడుకు వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతను తల్లిని ఆస్పత్రికి తరలించాడు. హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె శరీరం‌పై సుమారు 12 చోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. సుశీల తల్లిపై దాడి చేసిన పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కను మూడేళ్ల క్రితమే తీసుకువచ్చారు. హఠాత్తుగా ఆ కుక్క ఎందుకు దాడి చేసిందనేది ఎవరికీ అంతుబట్టలేదు. 

Updated Date - 2022-07-13T22:34:33+05:30 IST