ఢిల్లీలో కొత్తగా 82 కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-05-29T20:20:22+05:30 IST

దేశ రాజధానిలో కొత్తగా 82 కోవిడ్ మరణాలు సంభవించినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారంనాడు..

ఢిల్లీలో కొత్తగా 82 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా 82 కోవిడ్ మరణాలు సంభవించినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారంనాడు తెలిపారు. 'గురువారం వరకూ 82 మరణాలు కొత్తగా వచ్చి చేరారు. వీటిలో 13 మంది గత 24 గంటల్లో మృతి చెందారు. తక్కిన 69 మరణాలు గత 34 రోజుల్లో చోటుచేసుకున్నాయి. ఈ మరణాలనన్నీ క్రోడీకరించి ధ్రువీకరించుకున్నాం' అని సిసోడియా తెలిపారు.


కాగా, రాష్ట్రంలో ఇంతవరకూ 17,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. వీరిలో 1,106 కేసులు కరోనా పాజిటివ్‌గా గురువారంనాడు నిర్దారణ అయినట్టు చెప్పారు. మొత్తం 7,846 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరగా, మృతుల సంఖ్య 398కి చేరినట్టు సత్యేంద్ర జైన్ వివరించారు.

Updated Date - 2020-05-29T20:20:22+05:30 IST