ఏపీఎల్లో నాకౌట్లోకి 8 జట్లు
ABN , First Publish Date - 2022-01-18T06:04:20+05:30 IST
అనంతపురం ప్రీమియర్ క్రికెట్ లీ గ్-25లో 8జట్లు నా కౌట్లోకి ప్రవేశించా యి.
అనంతపురం క్లాక్టవర్, జనవరి 17 : అనంతపురం ప్రీమియర్ క్రికెట్ లీ గ్-25లో 8జట్లు నా కౌట్లోకి ప్రవేశించా యి. ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సం యుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఏపీఎల్-25 పో టీల్లో భాగంగా ఎస్ఎస్బీఎన, గుంత కల్లు జట్ల మధ్య పోటీ జరిగింది. మొద ట బ్యాటింగ్ చేసిన ఎస్ఎస్బీఎన 41.4 ఓవర్లలో 232పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో పవన కుమా ర్ రెడ్డి 68పరుగులు, షాకీర్ 46, అన్వర్ 43పరుగులు చేశారు. గుం తకల్లు బౌలర్ కమిల్ 8వికెట్లు తీసి ఎస్ఎస్బీఎన నడ్డి విరిచాడు. అ నంతరం బరిలోకి దిగిన గుంతకల్లు 48.2ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసి విజయం సాధించింది. కమిల్ ఆల్రౌండ్ షోతో 127పరుగులు, అజానహమ్మాద్ 91పరుగులు సాధించారు. పాయింట్ల ఆధారంగా అనంతపురం జోన నుంచి అనంతపురం, కణేకల్, గుత్తి, గుంతకల్లు, పెనుకొండ, ధర్మవరం, ఏఎస్ఏ, నార్పల జట్లు నాకౌట్లో కి అర్హత సాధించిట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు తెలిపారు.