780 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-19T06:21:49+05:30 IST

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 780 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ గొలుగొండ సీఐ కె.రాజారావు తెలిపారు.

780 కిలోల గంజాయి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది

- జీడిమామిడి తోటలో నిల్వ చేసినట్టు తెలిసి ఎస్‌ఈబీ సిబ్బంది దాడి

- నిందితులు పరారీ, వ్యాన్‌ సీజ్‌


కొయ్యూరు, మే 18: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 780 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ గొలుగొండ సీఐ కె.రాజారావు తెలిపారు. కొయ్యూరు మండలం చిట్టింపాడు పంచాయతీ నిమ్మగెడ్డ గ్రామానికి సమీపంలో ఒక జీడిమామిడి తోటలలో గంజాయి నిల్వచేసినట్టు బుధవారం ఉదయం సమాచారం అందిందని చెప్పారు. వెంటనే సిబ్బందితో వెళ్లి 39 గోనె సంచుల్లో ప్యాకింగ్‌ చేసిన 780 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు తెలిపారు. గంజాయితోపాటు అక్కడ వున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితులు పరారయ్యారని చెప్పారు. ఆర్‌టీవో ద్వారా వ్యాన్‌ యజమాని వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపడతామని, ఈ దాడుల్లో ఎస్‌ఐ బీవీజీ గిరిబాబు, సిబ్బంది పాల్గొన్నారని  సీఐ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T06:21:49+05:30 IST