74 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-08T10:14:39+05:30 IST

వైద్యఆరోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్‌ ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

74 పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 7: వైద్యఆరోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్‌ ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 28, సూర్యాపేట జిల్లాలో 23, యాదాద్రిభువనగిరి జిల్లాలో 23 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2244 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 2020 మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


పాజిటివ్‌ కేసులు ఇలా..

ర్యాపిడ్‌ పరీక్షల్లో దేవరకొండలో 10, అర్వపల్లి లో ఐదు, పీఏపల్లిలో మూడు, తిరుమలగిరిలో రెం డు, కేతేపల్లిలో మూడు, నడిగూడెంలో మూడు, చండూరులో నాలుగు, రాజాపేటలో ఒకటి, ఆలేరులో ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దామరచర్లలో ఆరు, గుర్రంపోడులో ఒకటి, కట్టంగూరులో ఏడు, మేళ్లచెర్వులో మూడు, సాగర్‌లో ఏడు, రామన్నపేటలో రెండు, శాలిగౌరారం ఆరు, తుంగతుర్తి రెండు, మోటకొండూరులో ఒకటి, డిండిలో ఒక పాజిటివ్‌ కేసునమోదైంది.


చౌటుప్పల్‌ సీహెచ్‌సీలో 32మందికి పరీక్షలు చేయగా, తొమ్మిది పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మర్రిగూడ మండల కేంద్రంలో ఒకే ఇంట్లో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాంపల్లి మండలంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌లో పనిచేసే ఓ అధికారికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పీఏపల్లి మండలం వద్దిపట్ల పంచాయతీ, పలుగుతండాకు చెందిన ఒకరు కరోనాతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Updated Date - 2020-08-08T10:14:39+05:30 IST