ఏడొందలు దాటాయి
ABN , First Publish Date - 2020-05-31T10:15:18+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ కేసులు 700 మార్కును దాటాయి. శనివారం జిల్లాలో ఎనిమిది మందికి కరోనా
- కొత్తగా 8 మందికి వైరస్
- జిల్లాలో 703కు చేరిన బాధితులు
కర్నూలు(హాస్పిటల్), మే 30: జిల్లాలో కరోనా వైరస్ కేసులు 700 మార్కును దాటాయి. శనివారం జిల్లాలో ఎనిమిది మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. తాజాగా వచ్చిన కేసులతో బాధితుల సంఖ్య 703కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు నగరంలో ఏడుగురు, దేవనకొండ మండలం తెర్నేకల్లో ముంబై నుంచి వచ్చిన వలస కార్మికురాలు ఉన్నారు. తెర్నేకల్లో 10 రోజుల క్రితం ఓ వలస కార్మికురాలికి వైరస్ సోకగా, తాజాగా రెండో కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది .
8 మంది డిశ్చార్జి
జీజీహెచ్ స్టేట్ కొవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురు, విశ్వ భారతి కొవిడ్ ఆసుపత్రి నుంచి నలుగురు డిశ్చార్జి శనివారం డిశ్చార్జి అయ్యారు. వీరిలో కర్నూలు నగర వాసి ఒకరు, ఆదోనికి చెందిన నలుగురు, నంద్యాల వాసులు ఇద్దరు, ఆళ్లగడ్డకు చెందిన ఒకరు ఉన్నారు. 75 ఏళ్ల మహిళ డిశ్చార్జి కావడంతో వైద్యులను కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. డిశ్చార్జి అయిన వారికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.