మరో ఐదేళ్లూ మోదీయే ప్రధాని కావాలని 70 శాతం ప్రజల ఆకాంక్ష : యడియూరప్ప

ABN , First Publish Date - 2020-06-02T02:14:28+05:30 IST

ఈ ఐదేళ్లే కాదూ.. వచ్చే ఐదేళ్లూ ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలని దేశంలో 70 శాతం మంది ప్రజలు

మరో ఐదేళ్లూ మోదీయే ప్రధాని కావాలని 70 శాతం ప్రజల ఆకాంక్ష : యడియూరప్ప

బెంగళూరు : ఈ ఐదేళ్లే కాదూ.. వచ్చే ఐదేళ్లూ ప్రధానిగా నరేంద్ర మోదీయే ఉండాలని దేశంలో 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. మోదీ ఉక్కు మనిషని, ఆర్టికల్ 370 ని రద్దు చేశారని అన్నారు. ‘‘ఈ టర్మే కాదు.. వచ్చే ఐదేళ్లూ ప్రధానిగా మోదీయే ఉండాలని 70 శాతం ప్రజల అభిమతం. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనే పరిష్కరించగలరు. ఇది దేశంలోని అత్యధిక యువకుల ఆకాంక్ష’’ అని ఆయన పేర్కొన్నారు.


ప్రధాని అసాధారణ, దూరదృష్టి నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని, రెండోసారి మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. ప్రత్యేకమైన పథకాలతో, సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అన్న నినాదంతో స్వావలంబన భారత్‌ దిశగా సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబకం అన్న స్ఫూర్తితో మన దేశంలోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో కూడా మోదీ ఖ్యాతి చెందారన్నారని యడియూరప్ప పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-02T02:14:28+05:30 IST