Chennai Airportలో పెద్ద మొత్తంలో పట్టుబడిన బంగారం

ABN , First Publish Date - 2022-08-06T16:35:37+05:30 IST

గత రెండు రోజుల్లో చెన్నై విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.09 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల(Electronic Goods)ను

Chennai Airportలో పెద్ద మొత్తంలో పట్టుబడిన బంగారం

Chennai : గత రెండు రోజుల్లో చెన్నై విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.09 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల(Electronic Goods)ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం(Customs department) శుక్రవారం తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం(The air intelligence wing of the department) ఆగస్ట్ 3, 4 తేదీల్లో దుబాయ్ నుంచి చెన్నైకి(Dubai to Chennai) వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల ప్యాంట్ పాకెట్‌లలో పేస్ట్ రూపంలో బంగారాన్ని, రెండు బంగారు గొలుసుల(Gold Chains)ను స్వాధీనం చేసుకున్నారు. 


పలువురు ప్రయాణికుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్(Principal Commissioner of Customs) నుంచి వెలువడిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లోని అరైవల్ హాల్ వద్ద టాయిలెట్ వెనుక పడి ఉన్న పేస్ట్ రూపంలో ఆరు ప్యాకెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రెండు రోజుల్లో రూ.3.09 కోట్ల విలువైన 6.50 కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2022-08-06T16:35:37+05:30 IST