ఉమ్మడి జిల్లాలో 570 పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-20T09:11:33+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం 570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, సెప్టెంబరు 19: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం 570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 316, సూర్యాపేటలో 153, యాదా ద్రి జిల్లాలో 101 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రభుత్వం శనివారం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్లో మాత్రం 241 కేసులు మాత్రమే చూపించారు. కాగా, శాలిగౌరారం మండలం రామాంజపురం గ్రామంలో 40 ఏళ్ల మాజీ ఉపసర్పంచ్ కరోనాతో మృతి చెందాడు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాపిడ్ పరీక్షల్లో నాగార్జునసాగర్ 30, భువనగిరి 29, మిర్యాలగూడ 22, నకిరేకల్ 21, కోదాడ 20, కట్టంగూరు 18, సూర్యాపేట 17,వలిగొండ, త్రిపురారం 16 చొప్పున, అనంతగిరి 14, చౌటుప్పల్ 13, దేవరకొండ, హుజూ ర్నగర్ 12చొప్పున, మునగాల 11, మర్రిగూడ, నేరేడుచర్ల 10 చొప్పున, బీబీనగర్, మఠంపల్లి ఎనిమిది చొప్పున, చండూరు, వేములపల్లి, కేతేపల్లి, కొండమల్లేపల్లి ఏడు చొప్పున, ఆత్మకూరు(ఎస్), నూతనకల్, నాంపల్లి, మాడ్గులపల్లి, బొమ్మలరామారం, తిరుమలగిరి, శాలిగౌరారం ఆరు చొప్పున, అడవిదేవులపల్లి, పీఏపల్లి, నార్కట్పల్లి, హాలియా, మోత్కూరు, రామన్నపేట, తుంగతుర్తి, నడిగూడెం, దామచర్ల ఐదు చొప్పున, నిడమనూరు, మోతె, భూదాన్పోచంపల్లి, పెన్పహాడ్, అడ్డగూడూరు, చివ్వెంల నాలుగు చొప్పున, మునుగోడు, తుర్కపల్లి, గుండాల, చిలుకూరు, డిండి మూడు చొప్పున, చిట్యాల, గరిడేపల్లి, యాదగిరి గుట్ట, గుర్రంపోడు, మేళ్ల చెర్వు, పాలకవీడు రెండు చొప్పు న, చింతపల్లి, చందంపే ట, కనగల్, నేరేడుగొమ్ము, తిప్పర్తి, అర్వపల్లి, ఆలేరు, మోటకొండూ రు, సంస్థాన్ నారాయణపురం ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.