ఢిల్లీలో 720కి చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-04-10T03:44:32+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 51 కేసులు కొత్తగా...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 51 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 720కి చేరింది. ఇప్పటివరకు 12మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,968 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 8,643 మందికి నెగెటివ్ వచ్చిందని, 605 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావల్సి ఉందని సీఎం కార్యాలయం వెల్లడించింది.