48 గంటల నిరసనలో 5,000 మంది నర్సులు
ABN , First Publish Date - 2021-06-24T01:12:35+05:30 IST
నిరవధికలో ఉన్న ఆశా కార్మికుల సమస్యలను మహారాష్ట్ర ప్రభత్వం ఇంకా పరిష్కరించలేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నర్సులు నిరసన చేస్తున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందని ప్రశ్నించారు
ముంబై: తాము ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు కనీసం దక్కాల్సినవి దక్కడం లేదని మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సుమారు 5,000 మంది నర్సులు 48 గంటల నిరసనకు దిగారు. తమ పని పెరిగినప్పటికీ తమకు ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వడం లేదని, సెలవులు ఉండడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరవధికలో ఉన్న ఆశా కార్మికుల సమస్యలను మహారాష్ట్ర ప్రభత్వం ఇంకా పరిష్కరించలేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నర్సులు నిరసన చేస్తున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందని ప్రశ్నించారు. తమకు సెలవులు, అలవెన్స్లు కావాలని నర్సులు డిమాండ్ చేశారు.