48 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-14T05:12:31+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) మాధవధార సర్కిల్‌-4 కార్యాలయ అధికారులు రైల్వే పోలీసులతో కలసి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో 48 కిలోల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.

48 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుకున్న గంజాయి, నిందితులతో సెబ్‌ సర్కిల్‌-4 అధికారులు

ఇద్దరి అరెస్టు  

మురళీనగర్‌, ఆగస్టు 13 : స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) మాధవధార సర్కిల్‌-4 కార్యాలయ అధికారులు రైల్వే పోలీసులతో కలసి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో 48 కిలోల గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సెబ్‌ సర్కిల్‌-4 ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌వీఎ్‌స ప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి...శనివారం మధ్మాహ్నం జ్ఞానాపురం రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ ఏరియాలో ఇద్దరు అనుమానిత వ్యక్తులను రైల్వే పోలీసుల సహకారంతో తనిఖీ చేశారు.  ఒడిశా నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన గురు జెనా,  రవీంద్రకుమార్‌ బెహరాలను అరెస్టు చేశారు. ఈ దాడిలో ఎస్‌ఐ శాంతి లక్ష్మి, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు ఫరీద్‌ సాహా, హరిదర్శన్‌ శర్మ, ఏఎ్‌సఐ పీఎం కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:12:31+05:30 IST