ఇంటర్ ప్రాక్టికల్స్కు 375 మంది గైర్హాజరు
ABN , First Publish Date - 2021-04-11T07:09:14+05:30 IST
ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలకు శనివారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 375మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో వి.శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు.
తిరుపతి(విద్య), ఏప్రిల్ 10: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలకు శనివారం ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 375మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో వి.శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. జనరల్ కోర్సుల్లో ఉదయం 1,928మందికిగాను 49మంది, మధ్యాహ్నం 1,892మందికిగాను 35మంది గైర్హాజరవ్వగా, ఒకేషనల్ విభాగంలో ఉదయం 2,594మందికిగాను 169మంది, మధ్యాహ్నం 2,098మందికిగాను 122మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. మొత్తంమీద జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో 8,512మందికిగాను 8,137మంది విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారని పేర్కొన్నారు.