ఏడు రోజుల్లో 32 లక్షలమంది వృద్ధులకు కరోనా వ్యాక్సిన్!

ABN , First Publish Date - 2021-03-09T14:43:28+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశలో అత్యధికశాతం...

ఏడు రోజుల్లో 32 లక్షలమంది వృద్ధులకు కరోనా వ్యాక్సిన్!

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశలో అత్యధికశాతం వృద్ధులు టీకా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. గడచిన ఏడు రోజుల్లో మొత్తం 32 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీనికిముందు ఫిబ్రవరి 3 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ 33 రోజుల్లో 66 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. 


ప్రభుత్వం వెలువరించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 2.09 కోట్లకు పైగా జనం కరోనా టీకాలు తీసుకున్నారు. మార్చి 1 నుంచి ఇప్పటి  32 లక్షల మంది వృద్ధులు టీకాలు తీసుకోగా, 45 సంవత్సరాల వయసు పైబడినవారు 4.80 లక్షల మంది తొలి డోసు టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకూ రాజస్థాన్‌లో అత్యధికంగా 21 లక్షల మంది కరోనా టీకా తీసుకోగా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో 20 లక్షలకు పైగా ప్రజలు టీకాలు తీసుకున్నారు. 

Updated Date - 2021-03-09T14:43:28+05:30 IST