హిందుపురం, బసవతారకం ఆస్పత్రికి రూ.30లక్షల మందులు

ABN , First Publish Date - 2021-05-06T14:35:55+05:30 IST

హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ రోగులకు

హిందుపురం, బసవతారకం ఆస్పత్రికి రూ.30లక్షల మందులు

  • అర్షిస్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం ఉదారత


హైదరాబాద్‌ సిటీ : హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ రోగులకు రూ.30 లక్షల విలువ చేసే రోగ నిరోధకం పెంపొందించే మందులను ఆర్షిస్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యాలు అందచేశాయి. ఈ చెందిన డా.వీఎస్‌ బి బండి, డా.టి.అన్నపూర్ణ ఈ మందులను బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా.ఆర్‌.వి.ప్రభాకర్‌రావుకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన హిందుపురం ప్రజలు కొవిడ్‌ మహమ్మారితో నానా ఇక్కట్లు పడుతున్నారని, వారిబాధలు తగ్గించేందుకు తమవంతుగా ఈ మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. హిందుపురం ప్రజల సేవకు నిరంతరం కృషిచేస్తున్న నందమూరి బాలకృష్ణకు చేయూతనందించి తద్వారా ప్రజలను ఆదుకోవాలన్నదే తమ అభీష్టమన్నారు. ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ అర్షిస్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌కు చెందిన డా.వియస్‌ బి బండి, డా.అన్నపూర్ణ చూపిన దాతృత్వం హిందుపురం ప్రజలతో పాటు కేన్సర్‌రోగులకు ఎంతో మేలుచేస్తుందన్నారు.

Updated Date - 2021-05-06T14:35:55+05:30 IST