ఇరుజిల్లాల్లో 29మందికి కొవిడ్
ABN , First Publish Date - 2022-07-28T05:52:19+05:30 IST
ఇరుజిల్లాల్లో 29మందికి కొవిడ్
ఖమ్మం కలెక్టరేట్/ కొత్తగూడెం పోస్టాఫీస్సెంటర్, జూలై 27: ఉమ్మడి జిల్లాలో బుధవారం 29మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 802 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 22మందికి, భద్రాద్రి జిల్లాలో 624మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణైందని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.