28 జిల్లాల్లో వెయ్యిలోపే Covid కేసులు

ABN , First Publish Date - 2022-02-04T16:44:37+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు త గ్గుముఖం పడుతున్నాయి. బెంగళూరు, బెళగావి మినహా మిగిలిన 28 జిల్లాల్లో నూ వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 16,426 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

28 జిల్లాల్లో వెయ్యిలోపే Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు త గ్గుముఖం పడుతున్నాయి. బెంగళూరు, బెళగావి మినహా మిగిలిన 28 జిల్లాల్లో నూ వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 16,426 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 6640, బెళగావిలో 1508, యాదగిరిలో 49మందికి నిర్ధారణ అయ్యింది. 44,819 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. 60 మంది మృతి చెందారు. బెంగళూరులో 14మంది, దక్షిణకన్నడ, మైసూరు, మండ్యలో ఐదుగురు చొప్పున హావేరి, చిక్కబళ్ళాపుర, బెళగావిలలో ముగ్గురు చొప్పున మృతిచెందగా మిగిలిన జిల్లాల్లో ఒకరిద్దరు ఉన్నారు. 

Updated Date - 2022-02-04T16:44:37+05:30 IST