233 ఎరువుల బస్తాల సీజ్
ABN , First Publish Date - 2021-07-27T05:34:04+05:30 IST
మండలంలోని గురండిలో అక్రమంగా నిల్వఉంచిన 233 ఎరువుల బస్తాలు సీజ్చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ అశోక్చక్రవర్తి తెలిపారు.
భామిని: మండలంలోని గురండిలో అక్రమంగా నిల్వఉంచిన 233 ఎరువుల బస్తాలు సీజ్చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ అశోక్చక్రవర్తి తెలిపారు. ముందస్తు సమా చారం మేరకు దాడిచేసినట్లు చెప్పారు. సుమారు 2.26 లక్షల విలువచేసే డీఏపీ, యూరియా, పొటాష్ను స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. వాటిని ఏవో తిలక్, వీఏఏ దుర్గాప్రసాద్, వీఆర్వో సన్యాసిరావు లకు అప్పగించినట్లు చెప్పారు.ఫ పోలాకి: పోలాకి, పిన్నింటిపేటల్లోని ఎరువుల దుకా ణాలను ఏడీఏ తిరుమలరావు, ఏవో వెంకటరావు, విస్తరణాధికారులు తనిఖీచేశారు. అలాగే పోలాకి ఆర్బీకేలో వ్యవసాయ విస్తరణాధికారులతో ఏవో సమీక్షించారు. ఫ లావేరు : వెంకటాపురంలోని రెండు ఎరువుల దుకాణాలను ఏడీఏ ఆర్.రవిప్రకాష్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో డి.విజయ్భాస్కర్ పాల్గొన్నారు.