216 రహదారి పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-02-27T05:00:19+05:30 IST
తీరం వెంబడి నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని జేసీ తేజ్భరత్ అదేశించారు.
నరసాపురం/మొగల్తూరు, ఫిబ్రవరి 26: తీరం వెంబడి నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని జేసీ తేజ్భరత్ అదేశించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో జరుగుతున్న విస్తరణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై ఆరా తీశారు. భూములు కోల్పోయిన వారికి పూర్తి పరిహారం అందించాలన్నారు. వేసవిలో పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ అధికా రులకు సూచించారు. మొగల్తూరు, ముత్యాలపల్లి, కాళీపట్నం, జగన్నాధ పురంలో పనులను పరిశీలించారు. ఆయన వెంట పీడీ సాయి శ్రీనివాస్, ఎన్హెచ్ అధికారి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి ఉన్నారు.