21 నుంచి ఎఫ్ఏ -1 పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-19T05:28:35+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకూ నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్ఏ-1 ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో ఎన్.సత్యసుధ సోమవారం తెలిపారు.
కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకూ నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్ఏ-1 ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో ఎన్.సత్యసుధ సోమవారం తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 30లోగా మార్కులును ఆన్లైన్లో (సీఎస్సీ)లో తప్పకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని ఈనెల 19కి బదులుగా 20న నిర్వహించాలని సూచిం చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిలాద్ ఉన్ నబీ సెలవును 20వ తేదీకి బదులుగా 19కు మార్చినట్లు చెప్పారు.