20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-05-24T05:20:22+05:30 IST

మండలంలోని దత్తాపురం ఎస్సీ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 20టన్నుల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు.

20 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ, పోలీసులు

కొండాపురం, మే 23: మండలంలోని దత్తాపురం ఎస్సీ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 20టన్నుల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేర కు ఎస్సీ కాలనీలో లారీలో లోడ్‌ చేసి ఉన్న 20 టన్ను ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్‌ మారుతీని అరెస్టు చేశారు. లారీ ప్రొద్దుటూరుకు చెందినదని తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ గోవిందు మోరే, ఆర్‌ఐ రాజేశ్వరమ్మ, ఎస్‌ఐ రవికుమార్‌, వీఆర్వో పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-24T05:20:22+05:30 IST