అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ

ABN , First Publish Date - 2022-05-25T05:19:05+05:30 IST

అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ

అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ
రాస్నంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎం.రమేష్‌

  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌

తాండూరు, మే 24 : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ హామీ ఇచ్చారు. మంగళవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్‌, పగిడ్యాల్‌, భాగాయిపల్లి, రాస్నం, గంగసార్‌ తదితర గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. రైతులకు, సాధారణ మహిళలకు, వృద్ధులకు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎంఎ్‌సపీ, రైతులకు బీమా వంటి అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ధారాసింగ్‌, ఉత్తమ్‌చంద్‌, అమృతయ్య, మొగులయ్య, మన్నన్‌, మాజీ సర్పంచ్‌ పద్మలత, గాండ్ల వీరన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:19:05+05:30 IST