19 జిల్లాల్లో తీవ్రమైన Covid

ABN , First Publish Date - 2022-01-14T17:50:16+05:30 IST

పది రోజుల్లోనే రాష్ట్రంలో కొవిడ్‌ ముఖచిత్రం మారిపోయింది. ఏకంగా 19 జిల్లాల్లో వైరస్‌ తీవ్ర పరిణామాలు చూపుతోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 25,005 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 18,374

19 జిల్లాల్లో తీవ్రమైన Covid

                     - 25 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు


బెంగళూరు: పది రోజుల్లోనే రాష్ట్రంలో కొవిడ్‌ ముఖచిత్రం మారిపోయింది. ఏకంగా 19 జిల్లాల్లో వైరస్‌ తీవ్ర పరిణామాలు చూపుతోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 25,005 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 18,374 మందికి ప్రబలింది. మైసూరులో 695 మందికి, దక్షిణకన్నడలో 625, తుమకూరు 547, హాసన్‌ 490, మండ్య 406, బెంగళూరు గ్రామీణ 390, కార్వార 399, ఉడుపి 379, కలబుర్గి 346, కోలారు 293, బెళగావి 276, ఉత్తరకన్నడ 250, శివమొగ్గ 212 మందికి వైరస్‌ సోకింది. బాగల్కోటెలో అత్యల్పంగా ఐదుగురికి ప్రబలగా పది జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లో 200లోపు కేసులు ప్రబలాయి. కేసులు పెరిగిన తరహాలోనే డిశ్చార్జ్‌లు అధికమయ్యాయి. 2,363 మంది కోలుకున్నారు. 8 మంది మృతిచెందగా బెంగళూరులోనే ముగ్గురు ఉన్నారు. ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. ప్రస్తుతం 1,15,733 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో బెంగళూరులో 90,893 మంది ఉన్నారు. 

Updated Date - 2022-01-14T17:50:16+05:30 IST