17 జిల్లాల్లో Covid కేసులు నిల్
ABN , First Publish Date - 2022-03-16T17:02:50+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 129 మందికి వైరస్ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 101 మంది 12 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 129 మందికి వైరస్ నిర్ధారణ కాగా 17 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 101 మంది 12 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 206 మంది కోలుకోగా ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం 30 జిల్లాల ఆసుపత్రుల్లో 2,341 మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 1,923 మంది ఉన్నారు. బీదర్, గదగ్, కొడగులలో ఒక్క యాక్టివ్ కేసు లేకపోవడం గమనార్హం.