పశ్చిమ గోదావరి: అత్తిలిలో ఒకేసారి 15 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-13T16:20:31+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.

పశ్చిమ గోదావరి: అత్తిలిలో ఒకేసారి 15 కరోనా కేసులు

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జిల్లాలోని అత్తిలి మండలంలో మాత్రం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఒకేసారి 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మండలానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్ బారిన పడ్డ బాధితులను తాడేపల్లి గూడెం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఒకేసారి ఇన్ని కేసులు ఎలా నమోదయ్యాయి..? ఎవరైనా విదేశాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి అత్తిలికి వచ్చారా..? అని తెలుసుకునే పనిలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ 15 మందితో కాంటాక్ట్‌లో ఉన్నవారి కోసం అధికారులు వెతుకుతున్నారు.

Updated Date - 2020-07-13T16:20:31+05:30 IST