రూ.15 కోట్లతో పరిగి పట్టణం అభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-01T04:30:47+05:30 IST
రూ.15 కోట్లతో పరిగి పట్టణం అభివృద్ధి
పరిగి: పరిగి మునిసిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నట్లు మునిసిపల్ చైర్మన్ అశోక్ అన్నారు. సోమవారం మునిసిపల్ పరిధిలోని ఏడవవార్డులోని విజయనగర్కాలనీలో కౌన్సిలర్ టి.వెంకటేశ్తో కలిసి సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వాడను అభివృద్ధి చేస్తానని చెప్పారు.కార్యక్రమంలో కె.అనిల్రెడ్డి, కల్లు శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, రవీంద్ర, ఎం.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.