జిల్లాకు చేరిన 1485 మెట్రిక్ టన్నుల యూరియా
ABN , First Publish Date - 2021-02-27T05:36:26+05:30 IST
జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 1485 మెట్రిక్ టన్నులు యూరియా శుక్రవారం జిల్లాకు చేరింది.
చిత్తూరు(సెంట్రల్), ఫిబ్రవరి 26: జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 1485 మెట్రిక్ టన్నులు యూరియా శుక్రవారం జిల్లాకు చేరింది. కాకినాడ నుంచి జిల్లా గోదాముకు చేరిన యూరియా స్టాక్ను డీడీఏ శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 18,050 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇందులో 600 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ వారికి ఇచ్చామని, వారు ఆర్బీకేల ద్వారా రైతులకు అందజేస్తారన్నారు. మిగిలిన మొత్తం డిమాండ్ మేరకు ప్రైవేటు ఫెర్టిలైజర్లకు ఇవ్వనున్నట్లు డీడీఏ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రమేష్బాబు, ఫెర్టిలైజర్ ఏవో ప్రవీణ్ ఉన్నారు.