పుణేలో ఇవాళ ఒక్కరోజే 1264 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-07-03T05:24:27+05:30 IST

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా పెను విలయం సృష్టిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 1264 మందికి...

పుణేలో ఇవాళ ఒక్కరోజే 1264 మందికి కరోనా

పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో కరోనా పెను విలయం సృష్టిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 1264 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 24,944కు పెరిగినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మహమ్మారి కారణంగా మరో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 806కు చేరింది. ‘‘కొత్తగా నమోదైన 1264 కేసుల్లో ఒక్క పుణే మున్సిపాలిటీ నుంచే 855 కేసులు వచ్చాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 19,011కి చేరింది..’’ అని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఇవాళ 631 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

Updated Date - 2020-07-03T05:24:27+05:30 IST