జిల్లాకు 125 గోదాముల మంజూరు

ABN , First Publish Date - 2022-05-27T06:51:35+05:30 IST

రైతులు పండించిన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్ఢు , ఆర్బీఐల ఆధ్వర్యంలో 125 గోదాముల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

జిల్లాకు 125 గోదాముల మంజూరు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్ట్టర్‌ హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 26: రైతులు పండించిన ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు నాబార్ఢు , ఆర్బీఐల ఆధ్వర్యంలో 125 గోదాముల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. గురువారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి పి.ఎస్‌.ప్రద్యుమ్న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ గోదాముల నిర్మాణాలకు లభ్యత మేర 25సెంట్ల నుంచి  ఎకరా స్థలం ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. 32 మల్టీ పర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ మంజూరు కాగా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సింగిల్‌ విండోల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ గోదాముల నిర్మాణాలకు సంబంధించి భూ సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. అంతకు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 697 పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 577 చెత్త సంపద తయారీ  కేంద్రాల ద్వారా వర్మీకంపోస్ట్‌ తయారు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-05-27T06:51:35+05:30 IST