జాబ్‌మేళాలో 122 మంది ఎంపిక

ABN , First Publish Date - 2022-09-29T06:24:26+05:30 IST

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 122 మందికి ఉద్యోగాలు లభించినట్టు ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సీహెచ్‌.సుబ్బిరెడ్డిలు పేర్కొన్నారు.

జాబ్‌మేళాలో 122 మంది ఎంపిక
ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేస్తున్న అధికారులు

కంచరపాలెం, సెప్టెంబరు 28 : కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 122 మందికి ఉద్యోగాలు లభించినట్టు ఉపాధి కల్పనాధికారులు కె.సుధ, సీహెచ్‌.సుబ్బిరెడ్డిలు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సీడాప్‌ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ జాబ్‌మేళాకు 459 మంది నిరుద్యోగులు జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యారు. వీరికి అర్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి 122 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.  డిమార్ట్‌, వైజాగ్‌ సెంట్రల్‌ వంటి షాపింగ్‌ మాల్స్‌, ఫార్మా రంగాలకు చెందిన 20 కంపెనీలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొన్నాయి. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంపికైన వారికి రీజనల్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారిణి ఉమాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభారాణి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. 

Updated Date - 2022-09-29T06:24:26+05:30 IST