విరిగిపడిన కొండ చెరియలు.. మట్టిలో 12 పుర్రెలు, ఎముకలు!

ABN , First Publish Date - 2020-08-16T03:01:44+05:30 IST

విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి.

విరిగిపడిన కొండ చెరియలు..  మట్టిలో 12 పుర్రెలు, ఎముకలు!

ఐజ్వాల్: విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. కానీ కూలిన కొండ చెరియల మట్టిలో 12 పుర్రెలు, ఎముకలు, నగలు దొరికాయి. ఈ ఘటన మిజోరాంలోని మమిత్ జిల్లాలో సంభవించింది. శుక్రవారం విరిగిపడిన కొండ చెరియల ప్రాంతంలో 12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు, స్మోకింగ్ పైప్, కొన్ని పాత్రలు లభించాయి. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్‌రోజామా వెల్లడించారు. ‘ఈ పుర్రెలు తదితరాలు ఏకాలం నాటివో నేను చెప్పలేను. సరైన వివరణ లేకుండా వాటి కాలాన్ని అంచనా వేయడం తప్పు. అందుకే ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయను’ అని ఆయన చెప్పారు. అలాగే తమకు దొరికిన వస్తువులన్నింటినీ ఫోరెన్సిక్ విభాగానికి పంపుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-08-16T03:01:44+05:30 IST