12 మేకలు అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2021-03-08T04:50:09+05:30 IST

మండల పరిధిలోని సానిపాయి పం చాయతీ తూర్పునగిరి అట్లువారిపల్లె ఈశ్వర్‌నాయుడు కు చెందిన 12 మేకలు సమీపంలోని కొండలో మేతకు వెళ్లి శనివారం రాత్రి అగ్నికి ఆహుతి అయ్యాయి.

12 మేకలు అగ్నికి ఆహుతి
మంటల్లో కాలిపోయిన మేకలు

వీరబల్లి, మార్చి7: మండల పరిధిలోని సానిపాయి పం చాయతీ తూర్పునగిరి అట్లువారిపల్లె ఈశ్వర్‌నాయుడు కు చెందిన 12 మేకలు సమీపంలోని కొండలో మేతకు వెళ్లి శనివారం రాత్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈశ్వర్‌నాయుడుకు దాదాపు 70 మేకలు ఉండేవి. అతను ప్రతిరోజూ కొండకు మేకలను తీసుకెళ్లి మేపుకుంటూ జీవనాధానం కొనసాగించేవాడు. యధావిధిగా శనివారం మేకలను కొండకు తీసుకెళ్లాడు. అదేరోజు కొంత మంది ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో అందులో 12 మేకలు మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు ఈశ్వర్‌నాయుడు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.1.20 లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం  తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.


Updated Date - 2021-03-08T04:50:09+05:30 IST