11వ పీఆర్సీ సిఫార్సులను అమలుచేయాలి
ABN , First Publish Date - 2021-04-17T05:57:56+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీ సిఫార్సులను తక్షణం అమలుచేయాలని పశుసంవర్థక శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీ సిఫార్సులను తక్షణం అమలుచేయాలని పశుసంవర్థక శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. అమలాపురం పశువైద్యశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్ర సంఘ గౌరవాధ్యక్షుడు జి.రాం బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంక టేశ్వర్లు, సి.అప్పలరాజులు హాజరై మాట్లాడారు. సమావేశంలో సంఘ ప్రతినిఽ దులు డాక్టర్ కె.శ్రీధర్, డాక్టర్ జి.మల్లేశ్వరరావు, ఎం.ఆంజనేయులు, కిషోర్, పూజితసాయి, సాయిరూప, వై.మాణిక్యాలరావు పాల్గొన్నారు.