సీబీఐసీకి 11,340 ఎకరాలు సేకరించాలి
ABN , First Publish Date - 2020-09-20T10:01:14+05:30 IST
చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ) కోసం 11,340.47 ఎకరాలను సేకరించాలని కలెక్టర్ చక్రధర్బాబు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగ్లాలో జరిగిన
ఏపీఐఐసీ అధికారుల సమీక్షల్లో కలెక్టర్
నెల్లూరు(హరనాథపురం); సెప్టెంబరు 19 : చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ) కోసం 11,340.47 ఎకరాలను సేకరించాలని కలెక్టర్ చక్రధర్బాబు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగ్లాలో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ సేకరించిన భూమికి సంబంధించి రైతులకు నగదు అందజేయాలన్నారు. ఏపీఐఐసీ, ఎన్ఐసీడీసీ సంయుక్తంగా కృష్ణపట్నం పోర్టు స్మార్ట్టెక్ ఏరియాను రూ.5,733.84కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయన్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల రూ.37500 కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, 2,96,140 మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, 17,1600 మంది నిరుద్యోగులకు పరోక్ష ఉపాధి లభిస్తుందనీ తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. ప్రతాప్, ఓఎ్సడీ కే. చంద్రశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జి.నాగభూషణం పాల్గొన్నారు.