ముంబై ఎయిర్‌పోర్టులోని భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-04T17:38:28+05:30 IST

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విధులు నిర్వర్తిస్తున్న 11 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది. తొలుత ఆరుగురికి

ముంబై ఎయిర్‌పోర్టులోని భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్

ముంబై: ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విధులు నిర్వర్తిస్తున్న 11 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ జరిగింది. తొలుత ఆరుగురికి మాత్రమే ఈ వైరస్ సోకినట్లు అంతా భావించారు. కానీ, శనివారం నాటికి ఈ సంఖ్య 11కు చేరిందని ముంబై మునిసిపల్ కమిషనర్ గణేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. 


‘‘ఒక జవానుకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే అతనితో పాటు కలిసి పని చేసిన అందరికి టెస్టులు నిర్వహించి క్వారెంటైన్‌కి పంపించాము. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వీరిని విధుల నుంచి తప్పించి.. క్వారెంటైన్‌లో ఉంచాము’’ అని దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. కరోనా సోకిన వారిని పన్వెల్‌లోని సబ్‌-డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలించామని ఆయన స్పష్టం చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్రయాణికులకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులు కాగా.. నాలుగో వ్యక్తి కోలుకున్నాడని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-04T17:38:28+05:30 IST