క్వారంటైన్‌లో 108 మంది ఢిల్లీ ఆసుపత్రి సిబ్బంది

ABN , First Publish Date - 2020-04-04T23:35:10+05:30 IST

కోవిడ్-19 బాధితులకు సన్నిహితంగా మెలిగిన 108 మంది ఆసుపత్రి సిబ్బందిని ఢిల్లీ ఆసుపత్రిలో...

క్వారంటైన్‌లో 108 మంది ఢిల్లీ ఆసుపత్రి సిబ్బంది

న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులకు సన్నిహితంగా మెలిగిన 108 మంది ఆసుపత్రి సిబ్బందిని ఢిల్లీ ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా బాధితులకు, కొందరు డాక్లర్లు, ఇతర వైద్య సిబ్బందితో కలుపుకుని దాదాపు 108 మంది సన్నిహితంగా మెలిగారు. దీంతో వారందరినీ క్వారంటైన్ చేసినట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలిపారు. అయితే వీరిలో 85 మంది హోం క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతిచ్చిన అధికారులు 23 మందిని మాత్రం ఆసుపత్రిలోనే క్వారంటైన్ చేశారు.


ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇప్పటివరకు 445 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక శాతం తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ఫష్టం చేశారు.

Updated Date - 2020-04-04T23:35:10+05:30 IST