ఎన్నిసార్లు ఫోన్ చేసినా పత్తాలేని 108
ABN , First Publish Date - 2020-08-10T10:03:56+05:30 IST
ఫోన్ చేయగానే 108 అంబులె న్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఆదుకోవాలి. అయితే అలా జరగడం లేదు.
పెడన : ఫోన్ చేయగానే 108 అంబులె న్స్ వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఆదుకోవాలి. అయితే అలా జరగడం లేదు. పెడన 14వ వార్డుకు చెందిన అవుటపల్లి దుర్గ ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆమెకు అత్యవసర చికిత్స అందిం చాల్సిరావడంతో బంధువులు 108కు ఫోన్ చేశారు. నిర్వాహకులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారే తప్ప.. అంబులెన్స్ను పంపలేదు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ 108 రాకపోవడంతో విసిగిపోయిన బంధువులు దుర్గను ఆటోలో తీసుకుని వెళ్లి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.