ఏడాదిలోగా 100 పడకల ఆస్పత్రి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-10-20T06:52:12+05:30 IST
చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో రూ.23 కోట్ల వ్యయంతో వంద పడకల
చింతలపూడి, అక్టోబరు 19: చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో రూ.23 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రికి కేటాయించిన నాలుగున్నర ఎకరాల స్థలాన్ని అధికారులతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, 100 పడకల ఆసుపత్రికి రూ.23 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తైందని త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.