చైనా వారి రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్‌

ABN , First Publish Date - 2020-08-12T08:02:03+05:30 IST

చైనా వారు, వారితో కలిసి స్థానికులు నిర్వహించే రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్‌ రాకెట్‌ని సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌) ఛేదించింది. భారీ స్థాయిలో హవాలా లావాదేవీలు...

చైనా  వారి రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్‌

  • స్థానికులు, బ్యాంకు ఉద్యోగులు, చార్టెడ్‌ అకౌంటెంట్ల ప్రమేయం


న్యూఢిల్లీ, ఆగస్టు 11: చైనా వారు, వారితో కలిసి స్థానికులు నిర్వహించే  రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్‌ రాకెట్‌ని సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌)  ఛేదించింది. భారీ స్థాయిలో హవాలా లావాదేవీలు, మనీ ల్యాండరింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో  ఇన్‌కం టాక్స్‌ అధికారులు  చైనా వారితో పాటు స్థానికుల స్థావరాలపై మంగళవారం  దాడులు చేసినట్లు బోర్డు తెలిపింది.


భారత్‌లో రిటైల్‌ షోరూమ్స్‌ ప్రారంభించడానికి చైనా కంపెనీ అనుబంధ సంస్థ, దానికి సంబంధించిన వారు  డొల్ల సంస్థల నుంచి రూ.100 కోట్ల బోగస్‌ అడ్వాన్సులు రప్పించినట్లు బోర్డు  పేర్కొంది. చైనాకు చెందినవారు  40కి పైగా బ్యాంకు ఖాతాలు తెరిచి,  ఆ ఖాతాల ద్వారా రూ.1000 కోట్లు  రప్పిచ్చినట్లు విచారణలో వెల్లడైందని వివరించింది. హవాలా లావాదేవీలు, మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగులు, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ప్రమేయం ఉన్నట్లు తేలిందని  తెలిపింది. 


Updated Date - 2020-08-12T08:02:03+05:30 IST