భారీ వర్షాలకు 10 మంది మృతి... పలువురికి గాయాలు!
ABN , First Publish Date - 2021-07-18T13:55:37+05:30 IST
భారీవర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి.
ముంబై: భారీవర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని చెంబూర్లో ఒక గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విక్రోలీలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మొత్తంమీద భారీ వర్షాల కారణంగా ముంబైలో ఇప్పటివరకూ 10 మంది మృత్యువాత పడ్డారు. చెంబూర్లో ఒక భారీ వృక్షం గోడమీద కూలడంతో ఆ గోడ విరిగిపడింది. దీంతో ఈ ప్రమాదం చోబుచేసుకుంది. కాగా ఈ గోడ కింద మరికొందరు బాధితులు కూడా ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పోలీసుల సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.