పట్టాలు తప్పిన ఎల్టీటీ-జేనగర్ ఎక్స్ప్రెస్
ABN , First Publish Date - 2022-04-04T00:53:11+05:30 IST
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో లోకమాన్య తిలక్ టెర్మినస్-జయ్నగర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ ..
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో లోకమాన్య తిలక్ టెర్మినస్-జయ్నగర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ (11061) పట్టాలు తప్పంది. ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో లహవిట్, దేవ్లాలి మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. 10 బోగాలు పట్టాలు తప్పాయని, అయితే భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఒకరు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, మెడికల్ వ్యాను సంఘటనా స్థలానికి పంపినట్టు సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. కాగా, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ స్టేషన్ వద్ద ఒక హెల్ప్లైన్ను రైల్వేలు ఏర్పాటు చేశారు.