సంగ్రామ యాత్రపై దాడి అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2022-08-16T06:01:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన గుండాలు రాళ్లతో దాడి చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర నేత చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఖండించారు.

సంగ్రామ యాత్రపై దాడి అప్రజాస్వామికం
మాట్లాడుతున్న సునీల్‌రెడ్డి

- బీజేపీ నేత చంద్రుపట్ల సునీల్‌రెడ్డి

మంథని, ఆగస్టు 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన గుండాలు రాళ్లతో దాడి చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర నేత చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఖండించారు. సోమవారం పట్టణంలో సునీల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామయాత్ర చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ గుండాలు దాడికి పాల్పడటం అమానుషమన్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కొమ్ముకాయడం సిగ్గు చేటన్నారు. బండి సంజయ్‌ సంగ్రామ యాత్రకు వస్తున్న జనాధారణ చూడలేకనే బీజేపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. వేల్పుల రాజు, ఎడ్ల సదాశివ్‌, సబ్బని సంతోష్‌, బోయిని నారాయణ, నాంపెల్లి రమేష్‌, కోరబో యిన మల్లికార్జున్‌, క్రాంతికుమార్‌, శ్రావణ్‌, సాగర్‌, దేవేందర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:01:53+05:30 IST