ఆజాదీ కా అమృత్ మహోత్సవం
ABN , First Publish Date - 2022-08-09T04:15:28+05:30 IST
ajadika amruth mahotsava
ఇందుకూరుపేట, ఆగస్టు 8 : మండలంలోని కొత్తూరు జడ్పీ హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులు సోమవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. లెఫ్ట్నెంట్ కమాండింగ్ ఆఫీసర్ వినయ్రామ్ చంద్రన్ ఆదేశాల మేరకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 సంఖ్య ఫార్మేషన్లో విద్యార్థులు విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు వి.మల్లి కార్జున, ఇన్చార్జ్ హెచ్ఎం వెంకటసుబ్బయ్య, ఎన్సీసీ బాధ్యులు కె.ఆరోరా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ జెండాలతో చిన్నారుల ర్యాలీ
పొదలకూరురూరల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సోమవారం మండలంలోని పులికల్లు గ్రామ ప్రాథమిక పాఠశాల పిల్లలు జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ పాలకులు ఈనెల 15 వరకు స్వచ్ఛాగ్రహ శానిటైషన్ క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ జీవీ సుబ్బమ్మ తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ, పరిసరాల్లోనూ, వీధుల్లోనూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధులు బారినపడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాధవి, నాయకులు నారాయణరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.