తొయ్యండయ్యా...!

ABN , First Publish Date - 2022-05-17T05:14:30+05:30 IST

కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక రిపేరు వస్తుండడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. మార్గ మధ్యలో ఆగిపోవడంతో వేరొక బస్సులో ప్రయాణికులను పంపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సంఘటనే ఒకటి రైల్వేకోడూరు టౌన్‌లో సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి- రైల్వేకోడూరు రూటు బస్సు రైల్వేకోడూరు నుంచి ఉదయం బయల్దేరింది.

తొయ్యండయ్యా...!
రైల్వేకోడూరులో బస్సు ఆగిపోవడంతో తోస్తున్న విద్యార్థులు, యువకులు

కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల కష్టాలు

రైల్వేకోడూరు, మే 16: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక రిపేరు వస్తుండడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. మార్గ మధ్యలో ఆగిపోవడంతో వేరొక బస్సులో ప్రయాణికులను పంపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సంఘటనే ఒకటి రైల్వేకోడూరు టౌన్‌లో సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి- రైల్వేకోడూరు రూటు బస్సు రైల్వేకోడూరు నుంచి ఉదయం బయల్దేరింది. కాసేపటికే బస్సు ఆగిపోవడంతో చేసేది లేక ప్రయాణికులందరూ దిగి తోయాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టణంలో ఇలా జరగడంతో కొద్ది మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, రైల్వేకోడూరు ఆర్టీసీ బస్టాండుకు కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాద్‌, తిరుపతి, రాజంపేట, రాపూరు, నెల్లూరు తదితర డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు వస్తాయి. వీటిల్లో రాజంపేట డిపోకు చెందిన బస్సులు చాలా వరకు కాలం చెల్లాయని ప్రయాణికులు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని కాలం చెల్లిన బస్సులను తీసివేసి కొత్త బస్సులను నడపాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-17T05:14:30+05:30 IST