సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి సునీత అనే మహిళకు దేవాన్ష్, రహస్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ సంఘం తరపున తనకు వచ్చే డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకు(Canara Bank)కు సునీత వెళ్లారు. దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరి పిల్లలను సైతం బ్యాంకుకు తీసుకెళ్లింది.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
వచ్చే ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎందుకంటే..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మకి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆయుధ పూజను నిర్వహించారు.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.
తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దశదిశను నిర్దేశించిందని చెప్పుకొచ్చారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. అనంతరం బతుకమ్మ పండగ విశేషాలను ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.