Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.
TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.
Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ తెలిపారు. ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.
Minister Thummala Nageswara Rao: నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరానికి కేబుల్ బ్రిడ్జి ఐకానిక్గా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.